schedule Tuesday, September 08, 2026

నామినేషన్‌ పత్రాల చోరీ..?

calendar_today December 3, 2025
person dharshininews
నామినేషన్‌ పత్రాల చోరీ..?
నామినేషన్‌ పత్రాల చోరీ..? - పంచాయతీ తాళం పగలగొట్టి అపహరణ - పెద్దేముల్ మండలం గొట్లపల్లిలో ఘటన - విచారణ జరుపుతున్న సబ్ కలెక్టర్, డీఎస్పీ తాండూరు, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చోరికి గురైనట్లు సమాచారం. పంచాయతీ కార్యాలయం తాళం పగలగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు పత్రాలను అపహరించుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన పెద్దేముల్ మండలంలో చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గొట్లపల్లి క్లస్టర్ పరిధిలో గొట్లపల్లి, గిర్మాపూర్, జయరాంతాండా పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ పత్రాలను స్వీకరించారు. సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు ఎన్నికల అధికారులు గొట్లపల్లి పంచాయతీ కార్యాలయంలోనే భద్రపరిచారు. అయితే బుధవారం ఉదయం పంచాయతీ కార్యాలయం తాళం ధ్వంసం అయినట్లు అధికారులు గుర్తించారు. కార్యాలయంలో సర్పంచ్ అభ్యర్థుల నామినేన్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్యలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పంచాయతి ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల నామినేష్లు చోరికి గురికావడం కలకలం రేపుతోంది. ఈ సఘటనపై అధికారులు విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39904/