schedule Friday, September 11, 2026

5న గోశాలలో ప్రత్యేక పూజలు

calendar_today July 3, 2024
person dharshininews
5న గోశాలలో ప్రత్యేక పూజలు
chai jr 5న గోశాలలో ప్రత్యేక పూజలు - మట్టి ఎడ్ల అమావాస్య కార్యక్రమాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని గోశాలలో ఈనెల 5న ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మట్టి ఎడ్ల అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గోసేవక్ వేణుగోపాల్ రెడ్డి దంతపులతో గోపూజకు ఏర్పాట్లు చేశారు. గోపూజతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. గోపూజ తరువాత ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చూడా నిర్వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో గోభక్తులు, గోసేవకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని గోశాల సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/27542/