schedule Friday, September 04, 2026

బ్యాంకుల కంటే అధిక వడ్డీ..!

calendar_today March 28, 2025
person dharshininews
బ్యాంకుల కంటే అధిక వడ్డీ..!
బ్యాంకుల కంటే అధిక వడ్డీ..! - పోస్టాఫీసులో ఇన్‌కమ్ పెంచే స్కీం - పెట్టుబడితో కస్టమర్లకు రాబడి - ఎవరు అర్హులు.. అర్హతలు ఏంటంటే..? దర్శిని డెస్క్ : దేశంలోని బ్యాంకులతో పాటు పోస్టాపీసులలో కూడా కస్టమర్లకు వడ్డీ అందించే పథకాలు ఎన్నో ఉన్నాయి. ప్రజలు పోస్టాఫీసు స్కీంలలో పెట్టుబడులు పెట్టి రాబడులు పొందుతున్నారు. పోస్టాఫీసులో అమలు అవున్న ఓ పథకంతో బ్యాంకుల కన్న అధిక వడ్డీ పొందే స్కీం అందుబాటులో ఉంది. దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. పోస్టాఫీసులో పెట్టుబడి పథకాలతో పాటు పొదుపు ఖాతా, రికరింగ్ డిపాజిట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి పొదుపు పథకాల్లో కూడా ఖాతాను తెరవవచ్చు. పోస్టాఫీసులో పొదుపు పథకాల కింద ఖాతా తెరవడం ద్వారా మీరు బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని పొందడమే కాకుండా మీ డబ్బును కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పోస్టాఫీసుకు సంబంధించిన ఓ పథకంలో మీరు రూ. 2 లక్షలు డిపాజిట్ చేయడం చేస్తే రెండళ్లకు రూ. 29,776 స్థిర వడ్డీని పొందవచ్చు. దేశంలోని అన్ని బ్యాంకులు తమ కస్టమర్ల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలను తెరిచినట్లే, పోస్టాఫీస్ కూడా తమ కస్టమర్ల కోసం టైమ్ డిపాజిట్ (టీడీ) ఖాతాలను తెరుస్తుంది. పోస్టాఫీసులో టీడీ ఖాతాను తెరవడానికి ఆ పోస్టాఫీసులోనే పొదుపు ఖాతా ఉంటే దీని సేవలు పొందవచ్చు. దేశంలోని ఏ పౌరుడైనా పోస్టాఫీసులోని టీడీ పథకంలో ఖాతాను తెరవవచ్చు. మీరు టీడీ ఖాతాలో కనీసం రూ. 1000 డిపాజిట్ చేయవచ్చు, అయితే దానిలో గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు. కస్టమర్ తనకు కావాల్సినంత డబ్బును డిపాజిట్ చేయవచ్చు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలానికి టీడీ ఖాతాలను తెరిచే సౌకర్యాన్ని అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే పోస్టాఫీస్ టీడీ ఖాతాలపై 6.9 శాతం నుండి 7.5 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. పోస్టాఫీసులో 2 సంవత్సరాల టీడీపై 7.0 శాతం వడ్డీని ఇస్తున్నారు. టీడీ ద్వారా మీరు రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ సమయంలో మీకు మొత్తం రూ. 2,29,776 లభిస్తుంది. మీరు టీడీ ఖాతాను తెరిచిన వెంటనే, మెచ్యూరిటీ సమయంలో మీకు ఎంత డబ్బు వస్తుందో మీకు తెలుస్తుంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34281/