ఇంటర్ ఫలితాల్లో..
May 9, 2023
dharshininews
ఇంటర్ ఫలితాల్లో..
- తాండూర్ చైతన్య ప్రభంజనం
- పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులు
- అభినందించిన కళాశాల యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంటర్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తాండూర్ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో అవదూత్ 470 మార్కులకు 464, వెంకటేష్ చౌవాన్ 470 మార్కులకు 455 సాధించారు. బైపీసీలో శ్రీయ 440 మార్కులకు 434, మహేందర్ 440 మార్కులకు 430 సాధించారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో విష్ణువర్ధన్ 1000 మార్కులకు 959, సింధు 1000 మార్కులకు 925 సాధించారు. బైపీసీలో ఫరియాతెహ్మిన 1000 మార్కులకు 972, గణేష్ రాథోడ్ 1000 మార్కులకు 906 సాధించారు. మరెందరో విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ పెరుమాళ్ళ వెంకట్ రెడ్డి, డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ అభినందిస్తూ స్వీట్ తినిపించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించేందుకు సహకరించిన అధ్యాపకులను అభినందించారు.

ఇది కూడా చదవండి....
హైఓల్టేజీ తంటా..!
- 50 ఇండ్లలో కాలిపోయిన గృహోపకరణాలు
- తాండూరు పట్టణంలో సంఘటన
- విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమన్న బాధితులు
https://dharshininews.com/17023

ఇది కూడా చదవండి....
హైఓల్టేజీ తంటా..!
- 50 ఇండ్లలో కాలిపోయిన గృహోపకరణాలు
- తాండూరు పట్టణంలో సంఘటన
- విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమన్న బాధితులు
https://dharshininews.com/17023