తాండూరు ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం
March 13, 2022
dharshininews
ప్రభుత్వ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం
- వివేకానంద ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య సేవలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ ప్రజలకు మంచి శుభవార్త. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని వివేకానంద ఆసుపత్రి ఆధ్వర్యంలో పేదలకు ఉచిత వైద్య శిబిరంతో వైద్య సేవలను అందిస్తున్నారు. ఆసుపత్రి 25 ఏండ్ల వార్షిక కమిట్మెంట్ను పురస్కరించుకుని ఆసుపత్రికి చెందిన డాక్టర్ భానుప్రియ ఆధ్వర్యంలో వైద్య సేవలను ప్రారంభించారు. గుండె సంబంధిత చికిత్స, కిడ్నికి సంబంధించిన చికిత్సలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు వైద్య శిబిరంలో ఉచితంగా సేవలను అందిస్తున్నారు. ఈ శిబిరం ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య శిబిరం కొనసాగనుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచించారు.