కమల్ అతహర్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ
January 19, 2023
dharshininews
కమల్ అతహర్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ
- కుటుంబ సభ్యులకు సానుభూతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కమల్ అతహర్ ను మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. కమల్ అతహార్ సతీమణి, తాండూరు బీఆర్ఎస్ నాయకులు మసూద్ వదిన అనారోగ్యంతో హైదరాబాద్ లో బుధవారం కన్నుమూశారు. ఏ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గురువారం కమల్ అతహర్ నివాసానికి చేరుకున్నారు. కమల్ అతహర్ కలిసి పరామర్శించారు. అయన సతీమణి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఎమ్మెల్సీ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.