schedule Monday, July 06, 2026

సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే పైలెట్ భేటీ..!

calendar_today May 24, 2023
person dharshininews
సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే పైలెట్ భేటీ..!
సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే పైలెట్ భేటీ..! - తాండూరులో గృహా ప్రవేశానికి ఆహ్వానం - కుటుంబ సభ్యులతో కలిసి కోరిన రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన తండ్రి విఠల్ రెడ్డి, తల్లి జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, యువనాయకుడు రితీష్ రెడ్డి తదితరులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చేనెల జూన్ 7వ తేదిన తాండూరు పట్టణంలో నిర్మించిన నూతన గృహ ప్రవేశ ఆహ్వానానికి రావాలని సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు నేతలు తెలిపారు. ఇది కూడా చదవండి... జోష్‌ పెంచిన మహేంద్రుడు..! - తాండూరు అసెంబ్లీ పోరుపై క్లారీటి - నిలిచేది నేనే గెలిచేది నేనే అంటూ ధీమా - గుర్తు మారోచ్చిన నేతలకు గుణపాఠమే https://dharshininews.com/17336 chaithany collage