తాండూరుకు మంత్రి తలసాని రాక
July 13, 2023
dharshininews
తాండూరుకు మంత్రి తలసాని రాక
- పలు కార్యక్రమాలకు హాజరు
- వెలువడిన అధికారిక ప్రకటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు తాండూరుకు విచ్చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి ఓఎస్డీ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేశారు. గురువారం ఉదయం 11-30లకు ఆయన తాండూరుకు విచ్చేస్తున్నట్లు ప్రకటించారు. తాండూరులో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొంటారని వివరించారు. మరోవైపు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాకను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖ అధికారులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తగు ఏర్పాట్లను చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటనను జయప్రదం చేయాలని నేతలు విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/18491