schedule Monday, July 06, 2026

కాంగ్రెస్ దార్శనీకతకు అద్దం భారత్ సమ్మిట్

calendar_today April 25, 2025
person dharshininews
కాంగ్రెస్ దార్శనీకతకు అద్దం భారత్ సమ్మిట్
కాంగ్రెస్ దార్శనీకతకు అద్దం భారత్ సమ్మిట్ - ప్రదర్శనలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత్ సమ్మిట్ కాంగ్రెస్ దార్శనీకతకు అద్దం పట్టేలా నిర్వహిస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అలీనోద్యమానికి పునాది వేసిన చారిత్రాత్మక బాండుంగ్ సమావేశం 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన భారత్ సమ్మిట్ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత్ సమ్మిట్ ద్వారా ఆర్థిక, సామాజిక, రాజకీయ సమాచార న్యాయానికి మార్గంగా నిలుస్తుందని అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ దార్శనీకతకు అద్దం పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఉన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35154/