schedule Monday, July 06, 2026

శ్రీవారి సేవలో విఠల్ నాయక్ దంపతులు

calendar_today May 27, 2025
person dharshininews
శ్రీవారి సేవలో విఠల్ నాయక్ దంపతులు
శ్రీవారి సేవలో విఠల్ నాయక్ దంపతులు - తిరుమలలో వేంకటేశ్వర స్వామి దర్శనం తాండూరు, దర్శిని ప్రతినిధి : తిరుమలలో వెలసిన శ్రీవారి సేవలో తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్, వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చైర్మన్ వర్య్త విఠల్ నాయక్, సతీమణి వర్త్యా కిష్టమ్మ(కోకట్ ఎల్ఎఫ్‌ఎల్ హెచ్ఎం)లు తరించారు. మంగళవారం అమావాస్య సందర్భంగా వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని బ్రేక్ దర్శనంలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని దర్శించుకోవడం జన్మజన్మల పుణ్యఫలం అన్నారు. శ్రీనివాసుని కరుణ కటాక్షాలు తాండూరు నియోజకవర్గ ప్రజలపై నిరంతరం ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35766/