schedule Sunday, July 05, 2026

తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు

calendar_today August 15, 2025
person dharshininews
తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు
తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు - బీజేపీలో చేరిక అవాస్తవం.. హస్యాస్పదం - ఖండించిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఓ వీడియాలో మాట్లాడారు. kvcs కొంతకాలంగా తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారాలను ఖండించారు. కొంతమంది కాలం గడుపుకునేందుకు తొత్తులుగా మారి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో బీజేపీ రూ. 100 కోట్లు, వేల కోట్ల కాంట్రాక్టులు ఇస్తామన్నా ఆశపడలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, తాండూరు ప్రజలకు అన్యాయం చేయోద్దని బీజేపీ కుట్రలను బహిర్గతం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని, తాండూరును అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే తన లక్ష్యమన్నారు. కొనఊపిరి ఉన్నంత వరకు తాండూరుకు సేవ చేయడమే ధ్యేయమని అన్నారు. ఎన్నటికి పార్టీని వీడే పనిచేయనని అన్నారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను తాండూరు ప్రజలు, పార్టీ నేతలు నమ్మరని అన్నారు. బీజేపీలోకి గువ్వల బాలరాజును పంపి.. తరువాత బీజేపీలో చేరుతానని కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం “లేదని, బీజేపీలో చేయడం హస్యాస్పదమే అని ఖండించారు. ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని ఇలాంటి ప్రచారాలను మానుకునీ.. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను, హామిలను నిలదీసే కార్యక్రమాలు చేపట్టాలని హితవు పలికారు. త్వరలోనే తాండూరుకు వస్తానని, స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం నేతలతో కలిసి పనిచేస్తామని అన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37758/