schedule Sunday, July 05, 2026

సల్లంగా చూడమ్మా.. దుర్గమ్మా..!

calendar_today September 30, 2025
person dharshininews
సల్లంగా చూడమ్మా.. దుర్గమ్మా..!
సల్లంగా చూడమ్మా.. దుర్గమ్మా..! - దుర్గామాత సేవలో బంటు మల్లప్ప - సాయిపూర్లో ప్రత్యేక పూజలు, అన్నదానం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : సల్లంగా చూడూ దుర్గమ్మా అంటూ తాండూరు పట్టణం సాయిపూర్ కు చెందిన కాంగ్రెస్ సీనీయర్ నాయకులు బంటు మల్లప్ప అమ్మవారిని వేడుకున్నారు. మంగళవారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సాయిపూర్ లో ప్రతిష్టించిన దుర్గామాతను బంటు మల్లప్ప కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మండపంలో కొలువు దీరిన అమ్మవారికి వేదపండితుల మంత్రోచ్చరణల మద్య పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని సల్లంగా చూడమ్మా.. దుర్గమ్మా అంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటి సభ్యులు బంటు మల్లప్పను సతీసమేతంగా సన్మానించారు. అనంతరం మండపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బంటు మల్లప్ప పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు స్థానిక యువకులు, అభిమానులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/38895/