schedule Tuesday, July 07, 2026

ఓటు హక్కు నమోదు చేసుకోండి

calendar_today January 19, 2024
person dharshininews
ఓటు హక్కు నమోదు చేసుకోండి
ఓటు హక్కు నమోదు చేసుకోండి - రేపు, ఎల్లుండి ప్రత్యేక క్యాంపులు - కొత్త ఓటు, చిరునామ మార్పులకు అవకాశం - తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : 18 ఏండ్లు నిండిన యువత కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 18 ఏండ్లు నిండిన యువతతో ఓటు హక్కు నమోదు చేయించేందుకు క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులు నియోజకవర్గంలోని 269 పోలింగ్ కేంద్రాల్లో క్యాంపులు కొనసాగుతాయన్నారు. బీఎల్ఓలు అందుబాటులో ఉంటారన్నారు. కొత్త ఓటు నమోదుతో పాటు కార్డులో తప్పులు, చిరునామ మార్పులు, డబుల్ ఓట్ల తొలగింపు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపుకు అనకాశం ఉంటుందన్నారు. కొత్త ఓటరు నమోదు కోసం ఫారం-6, మార్పులు, చేర్పుల కోసం ఫారం-8, డబుల్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపు కోసం ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23280/