మహేందర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ
October 9, 2024
dharshininews
మహేందర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ
- శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
- కలిసి సన్మానించిన తాండూరు నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చీఫ్ విప్ గా బాధ్యతలు చేపట్టిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. బుధవారం హైదరాబాద్ లో బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డిని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. మహేందర్ రెడ్డికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శుభకాంక్షలు తెలిపారు. అదేవిధంగా డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, నాయకులు అబ్దుల్ రవూఫ్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, మసూద్, అజయ్ ప్రసాద్ తదితరులు మహేందర్ రెడ్డిని సన్మానించి శుభకాంక్షలు తెలిపారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/29647/