హోంగార్డు లింగయ్య కన్నుమూత
October 25, 2024
dharshininews
హోంగార్డు లింగయ్య కన్నుమూత
- నివాళులు అర్పించిన చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి
- కుటుంబాన్ని పరామర్శించిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 22వ వార్డుకు చెందిన పోలీసు శాఖ సీనీయర్ హొంగార్డు లింగయ్య కన్నుమూశారు. శుక్రవారం తాండూరు పట్టణంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. లింగయ్య మృతదేహానికి మహేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా సీనీయర్ హోంగార్డు మృతి చెందిన విషయం తెలుసుకున్న నేతలు కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. చీఫ్ విప్ వెంట సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, కౌన్సిలర్ రాము, రజక సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/30002/