schedule Monday, July 06, 2026

భక్తి శ్రద్ధలతో అయ్యప్ప ఇరుముడి

calendar_today January 3, 2025
person dharshininews
భక్తి శ్రద్ధలతో అయ్యప్ప ఇరుముడి
భక్తి శ్రద్ధలతో అయ్యప్ప ఇరుముడి - శబరికి బయల్దేరిన అయ్యప్ప స్వాములు - ప్రత్యేక పూజలు చేసిన కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : అయ్యప్ప మాల ధరించిన స్వాములు భక్తి శ్రద్ధలతో ఇరుముళ్లను కట్టుకున్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వాముల ఇరుముళ్ల కార్యక్రమం వైభవంగా జరిగింది. గురుస్వాములు, ఆలయ పండితుల మంత్రోచ్చరణ మద్య ఇరుముడి కార్యక్రమం నిర్వహించుకున్నారు. అయ్యప్ప మాల ధరించిన కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరుముడిని కట్టుకున్నారు. అయ్యప్ప స్వామి పూజ అనంతరం ఇరుముడితో శబరికి బయల్దేరారు. ఆయనతో పాటు గురు స్వాములు కోట్రిక శ్రీకాంత్, కోట్రిక నాగరాజు, వివిధ ఆశ్రమాలకు చెందిన స్వాములు ఇరుముళ్లు కట్టుకుని శబరి యాత్రకు బయల్దేరి వెళ్లారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31950/