schedule Friday, September 11, 2026

అయ్యోధ్య రామయ్య సన్నిధిలో శంకరన్న..!

calendar_today February 3, 2025
person dharshininews
అయ్యోధ్య రామయ్య సన్నిధిలో శంకరన్న..!
అయ్యోధ్య రామయ్య సన్నిధిలో శంకరన్న..! - బాల రాముని దర్శించుకున్న భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : అయ్యోధ్య రామ మందిరం సన్నిధిలో తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయి పుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ తరించారు. సోమవారం అయోధ్యకు వెళ్లిన శంకర్‌ యాదవ్ తన మిత్ర బృందంతో కలిసి సందర్శించారు. దేవాలయంలో బాల రామున్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. అందరు దైవభక్తిని అలవర్చుకోవాలి అన్నారు. శంకర్‌ యాదవ్‌తో పాటు జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు విజయ్ కుమార్, తాండూరుకు చెందిన వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాములు యాదవ్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32770/