schedule Friday, September 11, 2026

ప్రయాగలో శంకరన్న పుణ్య స్నానాలు

calendar_today February 3, 2025
person dharshininews
ప్రయాగలో శంకరన్న పుణ్య స్నానాలు
ప్రయాగలో శంకరన్న పుణ్య స్నానాలు - కుంభమేళాలో పాల్గొన్న మిత్ర బృందం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతున్న మహాకుంభ మేళాలో తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ పాల్గొన్నారు. సోమవారం వసంత పంచమి సందర్బంగా ప్రయాగ్ రాజ్లో తన మిత్ర బృందంతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమంలో అమృతస్నానాలు చేసి తరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాకుంభ మేళాలో పాల్గొనడం భగవంతుని కృప అన్నారు. కుంభమేళా సనాధర్మంను పటిష్టం చేస్తున్నాయని అన్నారు. ఆయనతో పాటు జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు విజయ్ కుమార్, తాండూరుకు చెందిన వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాములు యాదవ్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32778/