schedule Monday, July 06, 2026

మనోహరన్న మస్తు గ్రేట్..!

calendar_today March 29, 2025
person dharshininews
మనోహరన్న మస్తు గ్రేట్..!
మనోహరన్న మస్తు గ్రేట్..! - అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావర హర్షణీయం - ఆయన ప్రత్యేక దృష్టితో అభివృద్ధి తథ్యం బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మస్తు గ్రేట్ అని ఎన్‌ఎస్‌యూఐ బషీరాబాద్ నాయకులు షేక్‌ సైబాస్ అభివర్ణించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు ప్రాంత సమస్యలపై గళమెత్తం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తాండూరు నియోజకవర్గంలోని ప్రతి మండలంపై పూర్తి అవగాహన కలిగి ఉండి.. స్పష్టమైన రీతిలో సమస్యలతో పాటు కావాల్సిన అభివృద్ధి, సంక్షేమం ప్రస్తావించడం ఆయన పనితనానికి నిదర్శమన్నారు. నియోజకవర్గంకు కావాల్సిన రోడ్లు, తాగునీటి సరఫరా, రేషన్ దుకాణాలు, మహిళా సంఘాలకు వరి కొనుగోలు కేంద్రాల అప్పగింత తదితర అంశాలపై సుదీర్ఘంగా ప్రస్తావించడం గర్వకారణమన్నారు. ఎన్నికల్లో గెలిపించిన తాండూరు నియోజవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి చిత్తశుద్దిని చాటుకుంటున్నారని అన్నారు. వచ్చే మూడేళ్లలో నియోజకవర్గం ప్రగతి, సంక్షేమంలో ఆదర్శంగా నిలవడం ఖాయమన్నారు. అందుకే మా ఎమ్మెల్యే మస్తు గ్రేట్.. ఎమ్మెల్యే వెన్నంటే ఉండి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను ఎన్ఎస్యూఐ ద్వారా విస్తృత ప్రచారంతో జనాల్లోకి తీసుకెళాతమని అన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34351/