బీజేపీ నేత అత్యుత్సాహం
May 10, 2024
dharshininews
బీజేపీ నేత అత్యుత్సాహం
- మైనర్ కొడుకుతో ఓటు వేయించిన వైనం
- స్వయంగా తీసిన వీడియో వైరల్
దర్శిని డెస్క్ : మధ్యప్రదేశ్లోని భోపాల్లోని బెరాసియాలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భాగంగా భోపాల్కు చెందిన బీజేపీ నేత వినయ్ మెహర్ అత్యుత్సాహం చూపించాడు. మంగళవారం ఓటింగ్ సమయంలో పోలింగ్ బూత్లోకి తన మైనర్ కుమారుడిని తీసుకెళ్లి ఓటు వేయించాడు. అంతేకాదు దీనిని వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. అయితే 14 సెకన్ల నిడివి గల ఈ వీడియోను బీజేపీ నాయకుడి ఫేస్బుక్ పేజీలో షేర్ చేసినట్లు సమాచారం.
కాగా బూత్లో ఉన్న బాలుడు, తండ్రి కమలం చిహ్నంతో లింక్ చేయబడిన EVM పై బటన్ను నొక్కినట్లు కనిపిస్తోంది. VVPAT ట్రయిల్ మెషిన్ ఓటు నమోదు చేసినట్లు చూపించడం వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ మొబైల్ ఫోన్తో పాటు తన కుమారుడిని పోలింగ్ బూత్లోకి ఎలా అనుమతించారని అధికారులను ప్రశ్నించారు. ప్రిసైడింగ్ అధికారి సందీప్ సైనీని సస్పెండ్ చేయడంతో పాటు బీజేపీ నేతపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వీడియో కింద చూడండి..
https://twitter.com/i/status/1788482478392615018
https://www.dharshininews.com/26332/