schedule Tuesday, July 07, 2026

వెల్‌కమ్‌ స్పీకర్ సార్..!

calendar_today May 10, 2024
person dharshininews
వెల్‌కమ్‌ స్పీకర్ సార్..!
వెల్‌కమ్‌ స్పీకర్ సార్..! - ప్రసాద్‌ కుమార్‌కు స్వాగతం చెప్పిన రవీందర్ గౌడ్‌ - సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డికి కూడా స్వాగతం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారు వేం సరేందర్ రెడ్డిలకు డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్ స్వాగతం పలికారు. శనివారం తాండూరులో జరగనున్న జన జాతరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శురాలు ప్రియాంక గాంధీ హాజరవుతున్న నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వేం నరేందర్ రెడ్డిలు తాండూరుకు విచ్చేశారు. ఇందులో భాగంగా తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు రవీందర్ గౌడ్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. వేం నరేందర్ రెడ్డికి కూడా స్వాగతం పలికారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26344/