మృతుల కుటుంబాలకు బీవీజీ ఫౌండేషన్ చేయూత
August 26, 2024
dharshininews
మృతుల కుటుంబాలకు బీవీజీ ఫౌండేషన్ చేయూత
- ఆర్థిక సాయం అందించిన డా.సంపత్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మృతుల కుటుంబాలకు తాండూరు కాంగ్రెస్ నాయకులు, బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.సంపత్ కుమార్ చేయూత అందించారు. తాండూరు మండలం బిజ్వార్ గ్రామానికి చెందిన కిష్టప్ప అనే వ్యక్తి మరణించారు. అదేవిధంగా యాలాల మండలం జుంటుపల్లి గ్రామానికి చెందిన మొగులమ్మ అనే మహిళ అకాల మరణం చెందారు. ఆయా గ్రామాల నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న డా.సంపత్ కుమార్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాల సభ్యులు డా.సంపత్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/28563/