schedule Tuesday, July 07, 2026

భక్తి మార్గం.. సేవా భావం..!

calendar_today September 18, 2024
person dharshininews
భక్తి మార్గం.. సేవా భావం..!
భక్తి మార్గం.. సేవా భావం..! - దత్తాత్రేయుని సేవలో విఠల్ నాయక్ - ఏండ్లుగా భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : భక్తి మార్గంలో నడుస్తూ సేవా తత్పరతను చాటుకుంటున్నారు తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్. ప్రతి పౌర్ణమికి కర్ణాటకలోని గాన్గాపూర్ లో వెలసిన దత్తాత్రేయ స్వామిని దర్శించుకునే ఆనవాయితీని పాటిస్తూనే ఏండ్లుగా అక్కడి భక్తులకు అన్నదానం చేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా బుధవారం పౌర్ణమి కావడంతో విఠల్ నాయక్ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పురోహితులతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దె వాలయం వద్ద తన సొంత ఖర్చులతో భక్తులకు, పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలన్నారు. భక్తి భావంలో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. అదేవిధంగా అన్నిదానాల కన్న అన్నదానం ఎంతో గొప్పదని, పేదల ఆకలిని తీర్చేందుకు అందరు తమవంతు తోడ్పాటు అందించాలన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29192/