వర్షానికి కూలిన ఇళ్లు
September 26, 2024
dharshininews
వర్షానికి కూలిన ఇళ్లు
- ఎవ్వరు లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం
- తాండూరు పట్టణంలో ఘటన
తాండూరు,దర్శిని ప్రతినిధి : కురిసిన భారీ వర్షానికి ఓ ఇళ్లు కూలిపోయింది. ఈ సంఘటన గురువారం తాండూరు పట్టణం ఇందిరానగర్ లో చోటు చేసుకుంది. ఇందిరానగర్ హమాలీబస్తీ ప్రాంతంలో అంతారం మల్లప్పకు చెందిన ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంటి పైకప్పు, గోడలు పూర్తిగా తడిసిపోయాయి. గురువారం ఉదయం అకస్మాత్తుగా ఇంటి కప్పు కుప్పకూలిపోయింది. గత కొన్ని రోజులుగా ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. అయితే అదే గోడలకు ఆనుకుని ఉన్న మిగతా ఇంటి సభ్యులు భయాందోళనకు గురయ్యారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/29382/