schedule Tuesday, July 07, 2026

మృతుని కుటుంబానికి బీఎస్‌ఆర్‌ చేయూత

calendar_today October 2, 2024
person dharshininews
మృతుని కుటుంబానికి బీఎస్‌ఆర్‌ చేయూత
మృతుని కుటుంబానికి బీఎస్‌ఆర్‌ చేయూత - అంతక్రియలకు ఆర్థిక సాయం తాండూరు, దర్శిని ప్రతినిధి : మృతుని కుటుంబానికి తాండూరు కాంగ్రెస్‌ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి(బీఎస్ఆర్) చేయూత అందించారు. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం క్యాద్గిరా గ్రామానికి చెందిన హరిజన్‌ కాశప్ప అనారోగ్యంతో మరణించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రెండు రోజులుగా మృతదేహాన్ని ఇంట్లో ఉంచుకుని బాధపడుతున్నారు. బుధవారం ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి తన సన్నిహితుల ద్వారా కుటుంబానికి చేయూతనందించారు. మృతుని అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం అందజేశారు. ఇందుకు కుటుంబ సభ్యులు శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29436/