ఆర్యవైశ్య యువజన సంఘం కార్యవర్గం ఎన్నిక
April 13, 2024
dharshininews
ఆర్యవైశ్య యువజన సంఘం కార్యవర్గం ఎన్నిక
- అధ్యక్షులుగా తర్లపల్లి భాను కుమార్
- ప్రకటించిన సంఘం సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఆర్యవైశ్య యువజన సంఘం కార్యవర్గం ఎన్నికయ్యింది. శనివారం సంఘం సభ్యులు 2024-2026 కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షులుగా తర్లపల్లి భాను కుమార్, ఉపాధ్యక్షలుగా పోకల నవీన్ కుమార్, గుబ్బ నరేష్, ప్రధాన కార్యదర్శిగా చీకటిమర్ల పునీత్ కుమార్, సహాయ కార్యదర్శులుగా కటకం హరీష్ కుమార్, నెమలిగ శ్రీనివాస్, కోశాధికారిగా దాచ చంద్ర శేఖర్ (చందు), పీఆర్వోగా ఆదిత్య(చిన్నా)లను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గం మాట్లాడుతూ సంఘం అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు కటకం వీరేందర్, కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్, మాజీ కార్యదర్శి కోట మురళీ, సభ్యులు చెన్నారం అనిల్ గుప్త, కల్వ రవికుమార్, కుంచెం మురళీ, కొట్రిక శ్రీకాంత్, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడ చదవండి...
https://www.dharshininews.com/25509/