మాంసం విక్రయాలు చేస్తే చర్యలు
April 16, 2024
dharshininews
మాంసం విక్రయాలు చేస్తే చర్యలు
- వ్యాపారులకు నోటీసుల పంపిణీ
- మున్సిపల్ కమీషనర్ ఆదేశాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మాంసం విక్రయాలు చేపట్టరాదని మాంసం వ్యాపారులకు మున్సిపల్ అధికారులు సూచించారు. ఈ విషయమై మంగళవారం మున్సిపల్ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని మటన్, చికెన్. బీప్ మాంసం వ్యాపారులకు. రెస్టారెంట్లకు, హోటల్ వ్యాపారులకు నోటీసులు అందజేశారు. శ్రీరామ నవమి సందర్భంగా ఎవ్వరు మాంసం విక్రయాలు చేపట్టరాదని నోటీసులో స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/25609/