schedule Tuesday, July 07, 2026

సాయిబాబను దర్శించుకున్న సరళా రెడ్డి

calendar_today July 21, 2024
person dharshininews
సాయిబాబను దర్శించుకున్న సరళా రెడ్డి
సాయిబాబను దర్శించుకున్న సరళా రెడ్డి - బాబా మందిరంలో ప్రత్యేక పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కోకట్ రోడ్డు మార్గంలో వెలసిన శ్రీ షిర్డీ సాయి బాబా దేవాలయంలో నిర్వహించిన గురుపౌర్ణమి ఉత్సవాలలో కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సతీమణీ ఆర్బీఓఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సరళా శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో సాయి బాబా విగ్రహానికి పుష్పాభిషేకం చేశారు. ఆలయ పండితుల వేదమంత్రోచ్చరణల మద్య పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటి సభ్యులు సరళా శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సన్నిహితులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27860/