మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
July 10, 2026
dharshininews
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
- ప్రతి ఇంట్లో పచ్చదనం పెంచాలి
- మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు.
శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 24, 1, 4, 5 వార్డులలో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చైర్ పర్సన్ నీరజా బాల్ రెడ్డి స్థానిక కౌన్సిలర్లు, మైప్మా సిబ్బందితో కలిసి మొక్కలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి వార్డులో ప్రతి ఇంటా మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మొక్కల పెంపకం తోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. కావున పచ్చదనం పెంపునకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/43737/
శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 24, 1, 4, 5 వార్డులలో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చైర్ పర్సన్ నీరజా బాల్ రెడ్డి స్థానిక కౌన్సిలర్లు, మైప్మా సిబ్బందితో కలిసి మొక్కలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి వార్డులో ప్రతి ఇంటా మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మొక్కల పెంపకం తోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. కావున పచ్చదనం పెంపునకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/43737/